కాకినాడ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ను శనివారం సాయంత్రం పిఠాపురం మాజీ MLA వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వర్మ తెలిపారు.