PDPL: ఏప్రిల్ 2న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి సందేశంతో సభను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని సూచించారు. ఇందిరమ్మ జీవిత బీమా, పాఠశాలల్లో అల్పాహారం పథకాల గురించి తెలుపాలన్నారు.