VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.