అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసులను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో చేరాలని ఎస్పీ కార్యాలయం అధికారులు తెలిపారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం.