TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. కేదార్తో ఆర్థిక లావాదేవీలను పోలీసులు గుర్తించారు. దుబాయ్లో డ్రగ్స్ ఓవర్ డోస్తో కేదార్ మృతిచెందాడు. రోహిత్, రితేష్ ఖాతాల నుంచి రూ.25 లక్షల లావాదేవీలు జరిగాయని, కేదార్తో లావాదేవీలపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. కస్టడీ రిమాండ్ కాపీలో కీలక అంశాలు నమోదు చేశారు.