AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సాక్షి మీడియా సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాశారని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ MD భారతీరెడ్డి, ఎడిటర్ బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పి.. నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆడబ్బును అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.