AP: ఈనెల 9న నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డోన్ మండలంలోని కొత్తబురుజులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.