AP: చిత్తూరు జిల్లా గంగవరం మండలం YSR జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న కంటైనర్ను వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.