ATP: గుత్తి రైల్వే జంక్షన్లో శుక్రవారం తెల్లవారుజామున కదులుతున్న రైలులో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో హైదరాబాద్కు చెందిన అరుణ అనే మహిళ ప్రయాణికురాలి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. ఈ ఘటనపై బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.