MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాలలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి దేవాలయ భూమిపూజలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆలయాలు కేంద్ర బిందువులని, భక్తిభావంతో పనులు త్వరగా పూర్తికావాలని ఆయన ఆకాంక్షించారు.