నంద్యాల: ఆత్మకూరు మండలం కృష్ణాపురం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్ బరాది (38) పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తుండగా ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. కృష్ణాపురం వద్ద సేదతీరుతున్న సమయంలో అతడు మృతి చెందగా, ఇవాళ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేసి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.