TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.