AP: వైసీపీ నేతల ఆందోళనలతో శాసనమండలి వాయిదా పడింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీలు తిరుమల శ్రీవారి సొమ్మును లూఠీ చేశాయని ఆరోపిస్తూ ఇవాళ కూడా వైసీపీ నేతలు మండలిలో నినాదాలు చేశారు. ర్యాలీగా నినాదాలు, ప్లకార్డులతో వారు మండలిలోకి రావడాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. ‘వారికి దేవుడిపై నమ్మకం లేదు. బుద్ధుందా’ అంటూ ఫైరయ్యారు. ఈ క్రమంలో మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.