AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.