TG: ఈ ఏడాది నుంచి స్కూళ్లలో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్తగా జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, చేయూత పథకం కింద రూ.2 లక్షల మందికి కొత్త పెన్షన్లు, కోహెడలో రూ.47 కోట్లతో చేపల మార్కెట్ నిర్మిస్తామన్నారు.