TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హతా పిటిషన్లపై ఈనెల 27, 28 తేదీల్లో విచారణ జరగనుంది. ఈ నెల 27 దానంపై దాఖలైన పిటిషన్ విచారణ చేపట్టనున్నారు. ఆయన తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సాక్ష్యాలు నమోదు చేయనున్నారు. ఈ నెల 28న కడియంపై దాఖలైన పిటిషన్ విచారించనున్నారు. ఆయన తరఫున కూడా స్పీకర్ సాక్ష్యాలు సమర్పించనున్నారు.