AP: నారాయణరావు అలియాస్ సోమన్న మిలటరీ ఆపరేషన్స్లో పేరొందారని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. అల్లూరి జిల్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి తర్వాత సోమన్న బాధ్యతలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏపీ, ఒడిశాల్లోనూ నగదు రివార్డులు ఉన్నాయన్నారు. చెల్లూరి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో ఒకరిద్దరు మినహా ఇంకెవరూ లేనట్లే అని చెప్పారు.