TG: రెవెన్యూశాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలో తహశీల్దార్, RDO ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని తెలిపారు. తొలిదశలో 60 తహశీల్దార్, 5 ఆర్డీవో ఆఫీసులకు కొత్త భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ముగింపు పలుకుతామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు.