AP: తిరుమల లడ్డూ కల్తీపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. తిరుపతి ఈస్ట్ పీఎస్లో తొలుత కేసు నమోదైందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటైందన్నారు. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ పునర్ వ్యవస్థీకరించడమైందన్నారు. 2014 నుంచి ఈ-టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.