ఇరాన్ సంపదను దోచుకోవడం కోసమే యుద్ధం ప్రకటించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెరవెనుక ఉండి అమెరికా మొత్తం నడిపిస్తోందని తెలిపారు. ‘అమెరికాకు ఎదురుతిరిగితే హతమారుస్తున్నారు. యుద్ధం కారణంగా చమురుపై ప్రభావం పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. టెర్రరిజానికి వ్యతిరేకంగా కాదు.. ట్రంప్కు వ్యతిరేకంగా పోరాడాలి’ అని నారాయణ పేర్కొన్నారు.