SRD: కొండాపూర్ మండలం అనంతసాగర్ మాజీ సర్పంచ్ అంకుశ ఇంద్రారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతిపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విట్టల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.