విజయనగరంలో విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆవిర్భావం బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయములో ఘనంగా జరిగింది. సమాజానికి ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ సాహిత్యము, సంస్కృతి, సేవ విభాగాలలో కళాకారులను ప్రోత్సహించాలి అన్నది ముఖ్య ఉద్దేశ్యమని సంస్థ అధ్యక్షురాలు భోగరాజు సూర్య లక్ష్మి తెలిపారు. అనంతరం పలు రంగాలలో సేవలందించిన వారికి సత్కరించారు.