VZM: కొత్తవలస మండలం వీరభద్రపురం పంచాయతీ పరిధిలో నిర్మించిన శ్రీ పైడితల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.