AP: విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కొత్తగా 7 స్టేషన్లు చేరాయి. ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 స్టేషన్లను విశాఖ జోన్కు రైల్వే శాఖ బదిలీ చేసింది. గతంలో ఈ 7 స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఖుర్దా డివిజన్ పరిధిలో ఉండేవి. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్.. రైల్వే బోర్డు, రైల్వే మంత్రి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ జోన్ కోసం ఎంతో పోరాడామన్నారు.