ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి అంతా నీటిలో నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.