దేశంలో డిజిటల్ చెల్లింపులు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. తాజాగా మార్చి నెలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు ఏకంగా 10 శాతం పెరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. దీని ప్రకారం మార్చి నెలలో మొత్తం యూపీఐ లావాదేవీలు రూ.29.52 లక్షల కోట్లకు చేరింది.