AP: శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రోడ్ రిపేర్ వల్ల డయేరియా వ్యాపించిందని, మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరగా 8 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.