ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 9 దాటాక 25% కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకునే వారిలో మలబద్ధకం, డయేరియా వంటి పేగు సమస్యలు 1.7 నుండి 2.5 రెట్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కాబట్టి సమయానికి తినడం ద్వారా పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.