భారత మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీహత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర,రాజీవ్ హత్యలు ప్రమాదలేనని సంచలన కామెంట్స్ చేశారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రాహుల్ తెవితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు.
బలిదానం అంటే భగత్సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్లదని చెప్పారు. వారు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు వదిలారన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉదని వెల్లడించారు. శ్రీనగర్లో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ ప్రసంగంపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానమిచ్చారు. ఒకరు తమ తెలివితేటల స్థాయిని బట్టి మాత్రమే మాట్లాడగలరని రాహుల్ను మంత్రి ఎద్దేవా చేశారు.
జమ్మూకశ్మీర్లో రాహుల్ యాత్ర సజావుగా ముగియడం ప్రధాని మోదీ ఘనతేనని కితాబునిచ్చారు. ఆర్టికల్ 370ని కనుక ప్రధాని మోదీ రద్దు చేయకపోయి ఉంటే జమ్మూకశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉండేవే కావని, అప్పుడు శ్రీనగర్లోని లాల్చౌక్లో రాహుల్ జాతీయ పతాకాన్ని ఎగరవేయగలిగి ఉండేవారే కాదని మంత్రి అన్నారు. కశ్మీర్లో హింస తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు బీజేపీ నేత మురళీమనోహర్ జోషి లాల్చౌక్లో జాతీయ జెండా ఎగరవేశారని మంత్రి గుర్తు చేశారు.