స్వలింగ సంపర్కులు చేసుకునే పెళ్లిళ్లకి చట్ట బద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించిన సంగతి తెలిసిందే. వాటికి స్పెషల్ మ్యారేజీ యాక్ట్ (Special Marriage Act) కింద లీగల్గా గుర్తింపును ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు సంబంధించిన చట్టాన్ని మార్చే అంశం పార్లమెంట్ (Parliament) పరిధిలో ఉందని వెల్లడించింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే స్వలింగ సంపర్కులకు సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని అభిప్రాయపడింది. స్వలింగ జంటలు తమ పెళ్ళిళ్ళను రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా క్లెయిమ్ చేయరాదని తీర్పు ఇచ్చింది.
తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) హాట్ కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందని ఆమె చెప్పింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు చెప్పడం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని లక్ష్మి తెలిపింది. మిగిలిన ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన మన దేశానికి ఇది నిజంగా అవమానమని చెప్పింది. ఇతర దేశాల్లో ఉన్న స్వలింగ సంపర్కులు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని… మన దేశంలో వీరి వివాహాలను అంగీకరించలేమా? అని ప్రశ్నించారు. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచాని(World)కి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం అని పేర్కొన్న ఆమె ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పిన స్వంత దేశంలో దీనిని తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు.
My heart is broken as I write with such disappointment over the Supreme Court's verdict refusing to legalize same-sex marriage. It is a true shame for a country that has embraced all forms of love and taught the rest of the world about love, yet has been denied this in its own…