కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రం ‘సూర్య-47’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నజ్రియా హీరోయిన్గా, నస్లెన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీలో ఊహించని సర్ప్రైజ్లు ఉంటాయని నస్లెన్ పేర్కొన్నాడు.