‘బలగం’ దర్శకుడు వేణు యెల్దండి.. నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీలో హీరోగా తమిళ స్టార్ కార్తీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బడ్జెట్ రూ.70 కోట్లు కావడంతో మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ ఉన్న కార్తీని తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.