టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కిష్కింధపురి’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ చిత్రం 2:05 గంటల నిడివితో రాబోతుంది. కాగా కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు.