ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది.