నటుడు ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రంగస్థలం సినిమా తనకు తెలుగు, తమిళంలో మంచి పేరు తెచ్చినట్లు చెప్పాడు. ‘రంగస్థలం ఇప్పుడు విడుదలయ్యుంటే పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందేది. ఆ మూవీలో నేను చనిపోయినట్లు నటించిన సన్నివేశం ఉంది. అప్పుడు నా చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి చాలా భయం వేసింది. థియేటర్లో ఆ సీన్ చూసి మా నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.