తనపై ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువాళ్లే అని మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ చెప్పారు. ‘కొత్త లోక’ మూవీ సక్సెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాను భారీ విజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా రోజుల తర్వాత తెలుగువాళ్లను కలవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉందని, కానీ మంచి కథ దొరకడం లేదని తెలిపారు.