TG: మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి నాగార్జున, నాగచైతన్య నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి ముందు తమ వాంగ్మూలం సమర్పించారు. కాగా, ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.