తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,057 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,990 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అదేవిధంగా హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.