AP: తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఉగాది ఆస్థానం సందర్భంగా శుద్ధి కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. ఆనంద నిలయం నుంచి ఆలయ ప్రాకారాల వరకు ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణంతో శుద్ధి నిర్వహించామన్నారు.