తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతుండగా.. 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,332 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.