TG: భద్రాచలంలో శ్రీరామనవమి రోజున జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవంలో గోటి తలంబ్రాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ తలంబ్రాలను AP చీరాల నుంచి భక్తులు పంపిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమం 13 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో తొలిసారి 500 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రక్రియ 25 వేల కిలోల వరకు పంపుతూ స్వామి సేవలో పునీతులవుతున్నారు. వీటిని కల్యాణంలో వినియోగించిన తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు.