AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గగుడి అధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఈనెల 8వ తేదీ వరకు అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈనెల 9వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.