AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ‘హరిద్రా ఘటనం’ (పసుపు దంచే కార్యక్రమం)తో ఈ వేడుకలు ప్రారంభించారు. APR 1న సా.6:30 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం ప్రారంభంకానుంది.