TG: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రులు, ఆలయ అధికారులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు రేవంత్ రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎం రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీపీ చీఫ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.