NLG: జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చిలో బాధ్యతలు చేపట్టిన కమిటీ గడువు ఈనెల 12తో ముగిసింది. పదవీ కాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఛైర్మన్ జూకూరి రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
HYD: కొండాపూర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందులో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీలకు రంజాన్ కానుకగా తోఫా అందజేసిందన్నారు. ఈ ప్రభుత్వం గత సంవత్సరం ఇవ్వని రంజాన్ తోఫా.. GHMC ఎన్నికల కోసమే పంపిణీ చేస్తుందని విమర్శించారు.
KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 1, 2 వార్డులను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించారు. ముందుగా దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి, లైట్లు, వైకుంఠధామం సమస్యలు, డ్రైనేజీ వంటి అంశాలను స్థానికులు తెలియజేశారు.
PDPL: గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు CITU ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే విజయరమణారావుకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, రెండవ పీఆర్సీ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల పేపర్ మూల్యాంకన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు DIEO గణేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం తొలిరోజు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సివిక్స్ పేపర్లకు మూల్యాంకనం జరుగుతుందన్నారు.
HYD: మియాపూర్ హఫీజ్పేట్లోని ఆదిత్యనాథ్ ఇంపీరియల్ అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 14న శ్వేత అక్కినపల్లి ఇంట్లో నగలు, నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇంట్లో పనిచేసే మహిళే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 60 గ్రాముల బంగారం, 4 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
HYD: మియాపూర్ హఫీజ్పేట్లోని ఆదిత్యనాథ్ ఇంపీరియల్ అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 14న శ్వేత అక్కినపల్లి ఇంట్లో నగలు, నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇంట్లో పనిచేసే మహిళే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 60 గ్రాముల బంగారం, 4 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
SRD: విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రావీణ్యత సాధించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి అన్నారు. శనివారం బీరంగూడలోని ఓ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
WGL: వరంగల్ స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు క్యాంప్ అధికారి, వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. ప్రతీ రోజు ఒక్కో ఎగ్జామినర్ 30 పేపర్ల మూల్యాంకనం చేయాలని, ఛీఫ్ ఎగ్జామినర్, విషయ నిపుణులు మూల్యాంకనంను పర్యవేక్షించాలని అన్నారు.
MDK: తూప్రాన్ పట్టణంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ రోడ్డుపై చెత్త వేసిన ఓ దుకాణ యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో జై లక్ష్మి గ్లాస్ ప్లైవుడ్ హార్డ్వేర్ దుకాణ యజమాని రోడ్డుపై చెత్త వేయడంతో ఇవాళ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 1000 జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయకుండా చెత్తని మున్సిపల్ వాహనాలకు అందజేయాలని కమిషనర్ సూచించారు.
BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం ఇచ్చారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9,300 కోట్లు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
KMM: నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఛైర్మన్గా డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎండోమెంట్ అధికారి సమత, ఈవో జగన్మోహన్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ఛైర్మన్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
JGL: మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట, పెద్దాపూర్, చౌలమద్ది గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని స్థానిక సర్పంచ్ లు అధికారులను కోరారు. మాన్పూర్ వాగుపై ఉన్న వరద కాలువ ద్వారా నీరు వదిలి చెరువులు నింపడంతో పాటు పంటలను కాపాడాలన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఈఎన్సీ ఇన్ చీఫ్ రమేశ్ బాబుకు వినతి పత్రం అందజేశారు.
MHBD: యాసంగి మొక్కజొన్న పంట పూర్తయి నెల రోజులు సమయం దగ్గరకు వస్తున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని శనివారం కొత్తగూడెం BRS(M) అధికార ప్రతినిధి నెహ్రు నాయక్ అన్నారు. గిరిజన రైతులు పండించిన పంటను దళారులు నాణ్యత పేరుతో అతి తక్కువకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు.