SRD: విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రావీణ్యత సాధించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి అన్నారు. శనివారం బీరంగూడలోని ఓ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.