సత్యసాయి: పెనుకొండలో కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రెవెన్యూ సేవల సంఘం ప్రతినిధులు మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత భవన పరిస్థితులను వివరించిన రెవెన్యూ సిబ్బంది, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మించాలని కోరారు.