PDPL: గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు CITU ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే విజయరమణారావుకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, రెండవ పీఆర్సీ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.