BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం ఇచ్చారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9,300 కోట్లు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు.