MDK: తూప్రాన్ పట్టణంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ రోడ్డుపై చెత్త వేసిన ఓ దుకాణ యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో జై లక్ష్మి గ్లాస్ ప్లైవుడ్ హార్డ్వేర్ దుకాణ యజమాని రోడ్డుపై చెత్త వేయడంతో ఇవాళ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 1000 జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయకుండా చెత్తని మున్సిపల్ వాహనాలకు అందజేయాలని కమిషనర్ సూచించారు.